- కాంగ్రెస్ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి…
- కార్యకర్తలకు నిరంతరం నాయకులు అందుబాటులో ఉండాలి…
- ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి…
- ప్రత్యర్థుల ఆరోపణలను ఎక్కడికక్కడ ఎండగట్టాలి…
- ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి…
- మండల, డివిజన్ పార్టీ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేత…
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 మహా:
పదవులను బాధ్యతగా స్వీకరించి, పార్టీకి, ప్రజలకు సేవచేసే అవకాశంగా భావించాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అబ్ధుల్లాపూర్మెట్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఆదిభట్ల, తొర్రూర్, తుర్కయంజాల్, కొంగరకలాన్, కుంట్లూర్, పెద్దఅంబర్పేట్, ఆదిభట్ల డివిజన్లకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు ఆయన అభినందనలు తెలిపారు. మంగళవారం సాయంత్రం తొర్రూర్లోని క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డితో కలిసి నూతన అధ్యక్షులకు ఆయన నియామకపత్రాలు అందజేశారు.
✳️ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతానికి నాయకులంతా ఐక్యంగా పనిచేస్తూ… కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మల్రెడ్డి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలు గడపగడపకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
✳️ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్లు కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, చిలుక మధుసూధన్రెడ్డి, పార్టీ నేతలు పాండురంగారెడ్డి, భూపతిగల్ల మహిపాల్, భాస్కరాచారి, ఈసీ శేఖర్గౌడ్, రాచర్ల వెంకటేశ్వర్లు, కొత్తకుర్మ శివకుమార్, ధనరాజ్ గౌడ్, కొత్తపల్లి జైపాల్ రెడ్డి, దాసు, జడల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








