గుంటూరు, మహా
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించి మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు. మహిళలు వ్యక్తిగత, కుటుంబ, సంక్షేమ, ఉపాధి తదితర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించిన గళ్ళా మాధవి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ…* గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ డే ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విని, సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అనేక మంది మహిళలు తమ సమస్యలకు పరిష్కారం పొంది సంతృప్తితో వెళ్తుండటం ఆనందంగా ఉందన్నారు. మహిళల సాధికారత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, మహిళలు ఈ గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో స్మరించుకున్నారు. విశ్వకర్మ భగవానుడు శ్రమకు, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచారని, సమాజ నిర్మాణంలో విశ్వకర్మ వర్గాల సేవలు విశేషమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ రావు, వేముల కొండా శ్రీనివాస్, కడియాల సుబ్బారావు, పదిరి ఈశ్వరాచారి, కలిచేటి హనుమంతరావు, చంద్రశేఖర్, ఉప్పతల సాంబ మరియు పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








