ఆమనగల్లు, మహా:: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవాలాంధిస్తానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.సోమవారం కడ్తాల్, ఆమనగల్లు,కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి,వెల్డండ పట్టణ కేంద్రాల్లో జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.కడ్తాల్ ముఖ ద్వారం నుండి అభిమానులు,నాయకులు బాణాసంచా, డిజే పాటల నృత్యాలు, భారీ గజమాలతో స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు.జాతీయ రహదారి మొత్తం జన్మదిన వేడుకల ఆనందోస్తాహలతో నిండిపోయింది.బాణాసంచా కాలుస్తూ యువకులు సంబరాలు జరుపుకున్నారు.జైపాల్ యాదవ్ కి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు, అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు,కార్యకర్తలకు తినిపించారు..ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అన్నారు.నియోజకవర్గ అభిమానులకు కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు.నిస్వార్థంగా పనిచేస్తూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు, ప్రతినిదులకు ప్రజల అండదండాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు.ప్రజా సేవకు అంకితమై పనిచేసే వారికి డబ్బులతో పనిలేదని, ప్రజాభిమానాలు వాటంతటవే వస్తాయన్నారు..ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








