ఖమ్మం సిటీ, మహా.
ఖమ్మంలో పి వై ఎల్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ వ్యతిరేకంగా బైక్ ర్యాలీ జరిగింది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయం నుంచి జెడ్పి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగి, అనంతరం గ్రంథాలయంలో సెమినార్ నిర్వహించారు. పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్, ఉపాధ్యక్షులు జిక్కుల భరత్, జిల్లా అధ్యక్షులు జాటోత్ ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ – ఉద్యోగాల కొరతతో యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, బెల్ట్ షాపులు, బెట్టింగ్ యాప్స్ను వెంటనే నిషేధించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
Post Views: 126








