Mahaa Daily Exclusive

  గునగల్ గ్రామంలో రెవెన్యూ సదస్సు రైతులు భూ సమస్యలు పరిష్కరించుకోవాలి మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
గునగల్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం చేసుకోవాలని యాచారం మండలం మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ అన్నారు. యాచారం మండలం, గునగల్ గ్రామంలో భూభారతి మాడ్యూల్స్ పై తాసిల్దార్ అయ్యప్ప సమక్షంలో రైతులకు అవగాహన కొరకు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులు భూభారతిని వినియోగించుకొని, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని తహసిల్దార్ అయ్యప్ప రైతులకు తెలిపారు. మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం రైతుల పక్షాన రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం, కావున భూ సమస్యలు ఏమైనా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన రైతులను కోరారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యాచారం మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ పవన్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి, మచ్చ లక్ష్మణ్, కాశమళ్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరు పాల్గొన్నారు.

Latest